News April 4, 2025

సంగారెడ్డి: శిశు గృహం చిన్నారులను సొంత పిల్లలా చూసుకోవాలి: జడ్జి

image

శిశు గృహలో ఉన్న చిన్నారులను కన్న పిల్లల చూసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్ సూచించారు. సంగారెడ్డిలోని శిశుగృహ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లల బాగోగులను పూర్తిగా చూసుకోవాలని చెప్పారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

కాకినాడ: GOOD NEWS.. ‘ఈనెల 11 నుంచి శిక్షణ’

image

వాకిలపూడిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఈనెల 11వ తేదీ నుంచి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. SSC లేదా ఆపై తరగతుల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. మూడు నెలల శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, యూనిఫాం కూడా అందిస్తారని పేర్కొన్నారు.

News December 3, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, లోన్ల వంటి పథకాలను వివరించారు. ఈ ఏడాది స్కూటీలు, లాప్‌టాప్‌లు, ట్రైసైకిళ్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 28 మందికి లోన్లు, 15 మందికి వివాహ ప్రోత్సాహకంగా రూ.15 లక్షలు మంజూరు చేశారు.

News December 3, 2025

తిరుపతిలో హోటల్ ఫుడ్‌పై మీరేమంటారు..?

image

తిరుపతికి రోజూ లక్షలాది మంది భక్తులు, ఇతర ప్రాంత ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో వందలాది హోటళ్లు తిరుపతిలో ఏర్పాటయ్యాయి. నిబంధనల మేరకు ఇక్కడ ఫుడ్ తయారు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిల్వ చేసిన మాసం, ఇతర పదార్థాలతో వంటలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వందలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ హోటళ్లు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్.