News December 4, 2024
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భూకంపం !
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల భూకంపం సంభవించింది. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, జగదేవ్పూర్, జోగిపేట, గజ్వేల్, కొమ్మేపల్లి, పొట్టపల్లి ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొనా, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.
Similar News
News January 22, 2025
ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ 6.9, అల్గోల్ 7.9, న్యాల్కల్ 8.7, అల్మాయిపేట 9.0, మల్చల్మ 9.6, కంకోల్, సత్వార్ 9.7, లక్ష్మీసాగర్ 9.8, దిగ్వాల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 10.0, కంది 10.2, కంగ్టి, మొగుడంపల్లి 10.3, పుల్కల్, ఝరాసంఘం 10.4, అన్నసాగర్ 10.5, బోడగాట్ 10.7, కల్హేర్ 10.8, దామరంచ, పోతారెడ్డిపేట, చౌటకూరు, సిర్గాపూర్ 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News January 22, 2025
రైల్వే ట్రాక్పై సిద్దిపేట అమ్మాయి తల, మొండెం (UPDATE)
HYD జామై ఉస్మానియాలో<<15212796>>అమ్మాయి సూసైడ్<<>> కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 22, 2025
సాంకేతికను అందిపుచ్చుకుందాం: కలెక్టర్ క్రాంతి
సాంకేతికను అందిపుచ్చుకుందామనిని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కందిలోని ఐఐటి హైదరాబాద్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఐఐటి హైదరాబాద్లో ఎన్నో ప్రయోగాత్మక పరిశోధన చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.