News March 28, 2025
సంగారెడ్డి: ‘సెర్ఫ్ లక్ష్యసాధనకు కృషి చేయండి’

సెర్ఫ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐకెపీ కేంద్రాలకు చెల్లించాల్సిన పెండింగ్ కమిషన్ వెంటనే చెల్లించాలని చెప్పారు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేట్ ఆర్డర్లు సైతం చేపట్టాలని సూచించారు.
Similar News
News November 22, 2025
‘టూరిజం స్పాట్గా దేవనూరు గుట్టల అభివృద్ధి’

దేవనూరు గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఉనికిచర్లలో ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రాంత ప్రజలు సెలవుల్లో సేదతీరేందుకు వీలుగా, ఈ ప్రాంతంలో ఆక్సిజన్ పార్కులు, ట్రెక్కింగ్ మార్గాలు, రాత్రి బస చేసేందుకు రిసార్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.
News November 22, 2025
మలికిపురం: డిప్యూటీ సీఎం పర్యటన ప్రాంతాలు పరిశీలిన

కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈనెల 26వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసనపల్లి, తూర్పుపాలెం, ములిక్కి పల్లి , శివకోడు ప్రాంతాలను పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్ని ప్రాంతాలను కలెక్టర్కు తెలిపారు.
News November 22, 2025
MBNR: పరీక్షలను సజావుగా నిర్వహించాలి.. పీయూ వీసీ ఆదేశం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీసీ ఆచార్య శ్రీనివాస్ ఎగ్జామినేషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మాల్ప్రాక్టీస్కు తావు లేకుండా పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు వీసీ స్పష్టం చేశారు. అనంతరం అధికారులకు ఆర్డర్ కాపీలను అందజేశారు.


