News March 28, 2025
సంగారెడ్డి: ‘సెర్ఫ్ లక్ష్యసాధనకు కృషి చేయండి’

సెర్ఫ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐకెపీ కేంద్రాలకు చెల్లించాల్సిన పెండింగ్ కమిషన్ వెంటనే చెల్లించాలని చెప్పారు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేట్ ఆర్డర్లు సైతం చేపట్టాలని సూచించారు.
Similar News
News October 18, 2025
పుతిన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ICC) వారెంట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో హంగేరీ వేదికగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్తో భేటీ అయ్యాక ఆయనను అదుపులోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని సమాచారం. ICCకి అరెస్ట్ చేసే అధికారం లేదు. అందులోని సభ్యదేశాలే ఈ పనిచేయాలి. కాగా పుతిన్కు భద్రత కల్పిస్తామని హంగేరీ PM చెప్పడం గమనార్హం.
News October 18, 2025
KNR: దరఖాస్తులకు స్పందన కరవు.. రీటెండరింగ్ తప్పదా?

2025-27కు గాను వైన్ షాప్ టెండర్లకు ఈ సారి ప్రభుత్వం ఆశించిన మేర స్పందన లేదు. ఒక్క షాప్కు 10 కంటే దరఖాస్తులు తక్కువ వస్తే రీ టెండర్ చేయాలన్న నిబంధన ఉంది. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా సుమారు 45 షాపుల వరకు 1, 2 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తులకు చివరి రోజు బీసీ రిజర్వేషన్ల బంద్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 వైన్ షాపులకు గాను 3261 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
News October 18, 2025
మార్టూరు బావిలో మృతదేహం

దిగుడు బావిలో గుర్తు తెలియని మృతదేహం శనివారం కలకలం రేపింది. మార్టూరు మండలం ఇసుకదర్శి – వలపర్ల పొలాల దారిలోని దిగుడు బావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.