News October 24, 2024
సంగారెడ్డి: సైబర్ బాధితుడికి రూ. 12.5 లక్షలు రీఫండ్

సైబర్ బాధితుడికి రూ.12.5 లక్షలు రీఫండ్ చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. హత్నూరకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నవీన్ రెండేళ్ల క్రితం ఆన్లైన్లో ఓ వ్యక్తికి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన నవీన్.. రూ.30 లక్షలు జమచేసి మోసపోయానని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 12.5 లక్షలను పోలీసులు హోల్డ్ చేసిన ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతాలో రీఫండ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News September 20, 2025
మెదక్ పోలీస్ పరేడ్.. అదనపు ఎస్పీ సమీక్ష

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్కు అదనపు ఎస్పీ మహేందర్ హాజరయ్యారు. పోలీసుల క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్ను ఆయన సమీక్షించారు. పరేడ్లు సిబ్బందిలో ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ను పెంచుతాయని పేర్కొన్నారు.
News September 20, 2025
వారంలోనే అన్నదమ్ముల మృతి.. నిజాంపేటలో విషాదం

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న గుండెపోటుతో మరణించిన ఘటన నిజాంపేట మండలంలో విషాదం నింపింది. 15 రోజుల క్రితం మహమ్మద్ జాన్ మియా(87) చనిపోగా, ఆ బాధతో ఆయన అన్న మహమ్మద్ షాబుద్దీన్(90) శుక్రవారం మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.