News March 17, 2025
సంగారెడ్డి: సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు: ఎస్పీ

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్లకు అలవాటు పడి, సైబర్ మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడవద్దని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. యువత డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్లకు పాల్పడినా ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.
News November 28, 2025
నాగార్జున సాగర్: శిల్పాలతో బుద్ధుని జీవితం బోధపడేలా..!

నాగార్జునసాగర్లో నిర్మిస్తోన్న బుద్ధచరిత వనం ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఇక్కడి శిల్పాలు బుద్ధుడి సంపూర్ణ జీవన ప్రయాణాన్ని జీవంగాను చూపిస్తున్నాయి. జననం, గౌతముని రాజకుమార జీవితం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం వంటి ముఖ్య ఘట్టాలు ప్రతీ శిల్పంలో ప్రతిబింబిస్తున్నాయి. సందర్శకులకు ప్రతి శిల్ప సమూహం ఆధ్యాత్మికత, శాంతి, బోధనలను స్పష్టంగా తెలియజేసేలా రూపొందించారు.


