News March 17, 2025

సంగారెడ్డి: సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు: ఎస్పీ

image

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడి, సైబర్ మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడవద్దని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. యువత డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 7, 2025

VJA: మాజీ డీసీపీ విశాల్‌ గున్ని కేసు అప్డేట్ ఇదే.!

image

విజయవాడ మాజీ డీసీపీ విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను వాయిదా వేయాలి’ అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది.

News November 7, 2025

రెబ్బెన: హత్య కేసు నిందితుడు పరార్!

image

హత్య కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ నిందితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం కలకలం రేపింది. చేతికి వేసిన సంకెళ్లతో స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. 5 రోజుల క్రితం తిర్యాణి మండలం పిట్టగూడాకి చెందిన హన్మంత్ రావును అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. దీంతో వినోద్‌ను పోలీసులు తీసుకొచ్చి విచారించారు. కాగా 4 రోజులుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 7, 2025

ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

image

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.