News March 27, 2025

సంగారెడ్డి: స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని వినతి

image

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో వేతనాలు విడుదల చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.

Similar News

News November 2, 2025

MHBD: 22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు!

image

22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు. MHBD MPPS జమాండ్లపల్లి, ఈదులపుసపల్లి, గడ్డి గూడెం, దంతాలపల్లి-గున్నేపల్లి, లక్ష్మిపురం, నెల్లికుదురు-మునిగలవీడు, గూడూరు-అయోధ్యపురం, లక్ష్మిపురం, తొర్రూర్-వెలికట్ట, వెంకటాపురం, అమ్మాపురం, సీరోల్-కాంపల్లి, తాళ్లసంకీస, నర్సింహులపేట-బోడ్కాతండా, గార్ల-చినకిష్టాపురం, కురవి-గుండ్రతిమడుగు, హరిదాస్ తాండ, కేసముద్రం-కల్వల, బోడగుట్ట తాండ, చిన్నగూడూర్ జయ్యారంలో ఉన్నాయి.

News November 2, 2025

మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

image

మెదక్​ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. మెదక్​ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.

News November 2, 2025

నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

image

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్‌పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.