News March 27, 2025
సంగారెడ్డి: స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని వినతి

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో వేతనాలు విడుదల చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
జగిత్యాల: 394 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో మొత్తం 436 వరి కొనుగోలు కేంద్రాలకు 394 కేంద్రాలు ఇదివరకే ప్రారంభం అయ్యాయని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. 56 కోట్ల రూపాయల విలువగల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 28 కోట్ల రూపాయల విలువ వరకు రైతుల వివరాలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 7 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రతి మండలానికి, క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్సెట్లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్కు 45 నిమిషాలు పట్టనుంది.
News November 14, 2025
మెదక్ జిల్లాలో కవిత పర్యటన

కవిత జాగృతి జనంబాట నేటి నుంచి మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. నర్సాపూర్ నలంద స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు. రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు, కాల్వలు, హై టెన్షన్ లైన్ కోసం భూములు కోల్పోయిన బాధితులతో సమావేశం. పోతన్ శెట్టిపల్లిలో వివిధ పార్టీల నుంచి జాగృతి చేరికలు, ఘణపూర్ ఆనకట్ట సందర్శన, ఏడుపాయల వన దుర్గా అమ్మవారి దర్శనం, మెదక్ చర్చ్, పల్లికొట్టాల డబుల్ బెడ్ రూం సందర్శిస్తారు.


