News April 17, 2025

సంగారెడ్డి: స్కావెంజర్ వేతనాలు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం నియమించుకున్న పారిశుధ్ధ్య కార్మికుల ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి వారికి చెల్లించాలని సూచించారు.

Similar News

News December 16, 2025

వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ నరసింహ

image

రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్, దట్టమైన పొగమంచు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, హైవేలపై డ్రైవ్ చేసేవారు తక్కువ వేగంతో, మంచి లైటింగ్, ఇండికేటర్లతో ఒకే లైన్‌లో వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు.

News December 16, 2025

‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

image

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

News December 16, 2025

పాడేరు: ‘మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి’

image

జిల్లాలో రెవిన్యూ రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మరలా గ్రామ సభలు నిర్వహించే నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. రీ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డీ పట్టా ల్యాండ్స్ పూర్తిగా పరిశీలించి, వెబ్ ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.