News January 30, 2025
సంగారెడ్డి: స్టాక్ మార్కెట్ పేరిట రూ.25.17 లక్షల మోసం

నకిలీ స్టాక్ మార్కెట్ పేరిట భారీ మొత్తంలో వ్యాపారి మోసపోయిన ఘటనపై అమీన్ పూర్ పీఎస్లో కేసు నమోదైంది. మున్సిపాలిటీలోని ఓ వ్యాపారికి గతేడాది Oct 8న వాట్సప్కు స్టాక్ మార్కట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని లింక్ మెసేజ్ రావడంతో రూ.25.17 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి ఇవ్వాలనడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News February 26, 2026
బంధాలకు మిడ్లైఫ్ క్రైసిస్ ముప్పు

40 దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా, మరి కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
News February 26, 2026
ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ.. రాజ్యసభ సీట్లపై చర్చ !

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


