News October 27, 2024

సంగారెడ్డి: స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

డీఎస్సీ-2024కు ఎంపికైన ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల 1:3 జాబితా 2 ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితాను www.deosangareddy.comలో ఉంచినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ విజయ

image

జవహర్ నవోదయవిద్యాలయంలో 2026-27విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై నిర్వహించే ప్రవేశ పరీక్షకు జిల్లాలో 6పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. ఈనెల 13న ఉదయం 11:30నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్ష నిర్వహింపబడుతుందన్నారు. జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, మెదక్‌లో 4, నర్సాపూర్, రామాయంపేటలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

News December 10, 2025

MDK: బాండ్ పేపర్ హామీలకు ఓట్లు వచ్చేనా?

image

ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల ట్రెండ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ బాండ్ ఇచ్చిన మాదిరిగానే జీపీ ఎన్నికల్లో అనేకచోట్ల బాండ్ పై అనేక హామీలతో కూడిన వాగ్దానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని అభ్యర్థులు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభ, లోక్‌సభ మాదిరిగా జీపీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు గ్రామ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు.

News December 10, 2025

మెదక్: 3వ విడతలో 20 జీపీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మూడవ విడతలో జరిగే ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 183 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. మండలాల వారీగా చిలప్ చెడ్-2, కౌడిపల్లి-7, కుల్చారం-3, నర్సాపూర్-2, శివంపేట- 3, వెల్దుర్తి-3 గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.