News February 8, 2025

సంగారెడ్డి: 10th ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు 

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారుగా 70 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

పెద్దపల్లి: యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. యాసంగిలో రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు. జిల్లాలో యూరియా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. యూరియా కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చన్నారు.

News February 8, 2025

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం జరగనున్న మహా కుంభాభిషేకం చివరి రోజు మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

News February 8, 2025

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ

image

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగలాంటిదని విజయోత్సవ సభలో చెప్పారు. ‘ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక్కడి ప్రజలు మోదీ గ్యారంటీని విశ్వసించి డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు. BJPని మనసారా ఆశీర్వదించారు. మీ ప్రేమకు అనేక రెట్లు తిరిగి ఇస్తాం’ అని పీఎం ప్రసంగించారు.

error: Content is protected !!