News April 15, 2025
సంగారెడ్డి: 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీర్గాపూర్ మండలం కడపలో 41.1 డిగ్రీలు నమోదు కాగా.. పటాన్ చెరు మండలం పాశమైలారంలో 40.8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40.7, కల్హేర్, ఖేడ్ 40.6, వట్టిపల్లి, పుల్కల్ 40.5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40.4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40.3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News December 13, 2025
కానిస్టేబుల్స్కు 16న నియామక పత్రాలు: హోంమంత్రి అనిత

కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్స్కు ఈనెల 16న నియామక పత్రాలు అందజేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నట్లు చెప్పారు.
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


