News April 15, 2025

సంగారెడ్డి: 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీర్గాపూర్ మండలం కడపలో 41.1 డిగ్రీలు నమోదు కాగా.. పటాన్ చెరు మండలం పాశమైలారంలో 40.8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40.7, కల్హేర్, ఖేడ్ 40.6, వట్టిపల్లి, పుల్కల్ 40.5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40.4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40.3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News December 9, 2025

ఎస్క్రో అకౌంట్ అంటే?

image

ఎస్క్రో ఖాతా అనేది థర్డ్ పార్టీ నిర్వహించే తాత్కాలిక అకౌంట్. ఇందులో కొనుగోలుదారు, విక్రేతల లావాదేవీకి సంబంధించిన డబ్బు/ఆస్తులను ఉంచుతారు. ఒప్పందంలోని షరతులు నెరవేరిన తర్వాతే అవి సంబంధిత పార్టీలకు విడుదలవుతాయి. ఇది 2 పక్షాలకు భద్రతను అందిస్తుంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం మాత్రమే చెల్లింపు జరుగుతుందని ఇది నిర్ధారిస్తుంది. మన దేశంలో ఎస్క్రో అనేది పరిశ్రమలు, వ్యాపారం తదితర లావాదేవీలలో ఉపయోగిస్తారు.

News December 9, 2025

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

image

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.

News December 9, 2025

ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

image

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్‌లో లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్‌పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.