News March 12, 2025

సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

image

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత

image

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో సమావేశం అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనబడని పరిస్థితి ఉందన్నారు.

News November 27, 2025

ఆసిఫాబాద్ ఎస్ఈగా జాడే ఉత్తమ్ బాధ్యతల స్వీకరణ

image

ఎన్పిడిసిఇఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా జాడే ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మంచిర్యాలలో ఎస్ఈగా పనిచేసిన ఆయన బదిలీపై ఆసిఫాబాద్ వచ్చారు. మాజీ ఎస్ఈ శేషారావు ఆదిలాబాద్‌కు మారారు. జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఉత్తమ్ తెలిపారు.