News March 12, 2025
సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 26, 2025
GWL: దివ్యాంగులకు క్రీడా పోటీలు: కలెక్టర్

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొనాలని కోరారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, పాల్గొనేవారు సర్టిఫికెట్తో 29న స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
GWL: దివ్యాంగులకు క్రీడా పోటీలు: కలెక్టర్

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న గద్వాల ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని దివ్యాంగులు పాల్గొనాలని కోరారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని, పాల్గొనేవారు సర్టిఫికెట్తో 29న స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.


