News March 12, 2025

సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

image

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 25, 2026

WGL: ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ!

image

మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా దరఖాస్తుల స్వీకరించనున్నారు. నేటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ పెద్దల వద్దకు పరుగులు తీయనున్నారు.

News January 25, 2026

GNT: పెళ్లి పేరుతో ఘరనా మోసం.. రూ.5 లక్షలతో వధువు పరార్!

image

తాడేపల్లి మండలం పెనుమాకలో పెళ్లి పేరుతో మోసం వెలుగుచూసింది. శ్యామల అనే హిజ్రా, విజయలక్ష్మీ అనే మహిళను నల్గొండకు చెందిన దివ్యాంగుడు సందీప్ రెడ్డికిచ్చి వివాహం జరిపించారు. కొన్నాళ్లకే తల్లికి బాగోలేదని చెప్పి, రూ. 5 లక్షల నగదు, బంగారంతో వధువు, శ్యామల కలిసి ఉడాయించారు. ఆరా తీయగా ఆమెకు ముందే పెళ్లయిందని తేలింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్యామల గతంలోనూ ఇలాంటి మోసాలు చేసినట్లు సమాచారం.

News January 25, 2026

త్వరలో తిరుపతిలో క్యారవాన్ బస్సులు

image

పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యారవాన్ బస్సులు తిరుపతికి రానున్నాయి. తిరుపతి సహా జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించే దిశగా చర్యలు అధికారులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కొన్ని ట్రావెల్ యాజమాన్యాలతో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ చర్చలు ఫలించి ఒప్పందం కుదిరితే త్వరలో తిరుపతిలో క్యారవాన్ బస్సులు తిరుగనున్నాయి.