News March 9, 2025
సంగారెడ్డి: 21 రోజులు.. చేయాల్సిన ఖర్చు రూ.39 కోట్లు

మిగిలింది 21 రోజులు.. ఖర్చు చేయాల్సింది రూ.39 కోట్లు. ఈ లెక్కలు ఏంటని అనుకుంటున్నారా.. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనిదినాలను బట్టి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు అవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.60.40 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని 50 శాతం నిధులు ఖర్చు చేశారు. మార్చి 31లోపు రూ.39 కోట్లు ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి పోనున్నాయి.
Similar News
News November 24, 2025
మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
News November 24, 2025
పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.
News November 24, 2025
NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


