News January 27, 2025

సంగారెడ్డి: 31 వరకు గడువు పెంపు: డీఈవో

image

విద్యార్థుల గుర్తింపు కోసం తీసుకువచ్చిన అపార్ దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఎంఈవోలు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ బాధ్యతలు

image

నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్పీ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తానన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 14, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

image

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.

News September 14, 2025

ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

image

TG: హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.