News March 11, 2025

సంగారెడ్డి: 31 వరకు చివరి అవకాశం: కలెక్టర్

image

పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఈనెల 31వ తేదీ వరకు 25% రాయితీ ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News March 12, 2025

సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 36.7°c, కోనరావుపేట 36.5°c, సిరిసిల్ల 36.1°c, ఇల్లంతకుంట 36.0°c, ఎల్లారెడ్డిపేట 36.0°c, చందుర్తి 35.4°c, వేములవాడ 35.0°c,రుద్రంగి 34.5°c, ముస్తాబాద్ 34.5°c లుగా ఉష్ణోగ్రత నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో 8 మండలాలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 12, 2025

గ్రూప్ 2లో మెరిసిన ఆసిఫాబాద్ ఆణిముత్యం

image

కౌటాల మండల వాసి సాయిరాం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించారు. కాగా ఇప్పుడు బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా విజయం సాధించినప్పటికీ దానిని వదులుకున్నట్లు సాయిరాం గౌడ్ తెలిపారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ములుగు జిల్లా ఎదురు చూస్తోంది!

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న గోదావరి కరకట్ట నిర్మించాలని, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!