News February 11, 2025
సంగారెడ్డి: 696 మంది పంచాయతీ ఎన్నికల సిబ్బంది నియామకం

సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 696 మంది ఉపాధ్యాయులను ఆర్వో, ఎఆర్వోలుగా నియమిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
శుభ సమయం (17-11-2025) సోమవారం

✒ తిథి: బహుళ త్రయోదశి తె.5.09 వరకు
✒ నక్షత్రం: చిత్త తె.5.20 వరకు
✒ శుభ సమయాలు: సా.7.45-8.10.
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.12.04-1.40
✒ అమృత ఘడియలు: రా.10.49-12.31
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.


