News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.
Similar News
News November 15, 2025
ఈ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్లరు.. ఎందుకంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోని ఓ ఊరు ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా(TG) మల్దకల్ ప్రజలు తిరుమలకు వెళ్లరు. దీనికి కారణం ఆ ఊరిలోనే వెలసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయం. తమ స్థానిక దైవమైన తిమ్మప్పనే తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. ఇక్కడ ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రజలు తమ ఇళ్లను ఆలయ గోపురం కంటే ఎత్తుగా నిర్మించరు.
News November 15, 2025
విశాఖలో వర్చువల్గా రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్ల శంకుస్థాపన

విశాఖలో 2వ రోజు CII సమ్మిట్లో CM చంద్రబాబు రేమండ్ గ్రూప్ ప్రాజెక్ట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆ సంస్థల డైరెక్టర్ గౌతమ్ మైనీ తెలిపారు. రాప్తాడులో రూ.479.67 కోట్లతో అప్పెరెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, అనంతపురం (D) గుడిపల్లిలో ఆటో మాన్యుఫాక్చరింగ్ కాంపొనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద గ్లోబల్ ఎరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ వస్తోందన్నారు.
News November 15, 2025
పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర?

జమ్మూకశ్మీర్ నౌగామ్ <<18292633>>పోలీస్ స్టేషన్<<>>లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ PAFF ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర కూడా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ కేసు దర్యాప్తు చేస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు J&K పోలీసులు ప్రకటించారు. కానీ, ఉగ్రకోణం అనుమానాలను కొట్టిపారేయకుండా ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించారు.


