News February 11, 2026
సంగారెడ్డి: 9 గంటలకు 13.19% పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలో ఉదయం 9 గంటలకు 13.19 శాతం పోలింగ్ నమోదైంది. ఆందోలు జోగిపేట- 14.13, గడ్డపోతారం-15.47, గుమ్మడిదల- 12.40, ఇంద్రేశం- 13.30, జిన్నారం 12.57,కొహీర్- 16.52, ఇస్నాపూర్- 17.13, నారాయణఖేడ్- 11.10, సదాశివపేట- 15.68, సంగారెడ్డి 6.94, జహీరాబాద్ 16.64% శాతం పోలింగ్ నమోదయింది.
Similar News
News March 17, 2026
రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
News March 17, 2026
మంచిర్యాల: బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి: కలెక్టర్

పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) నియమించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News March 17, 2026
బ్యాంకర్లు రుణాల లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్

అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆనంద్ బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ముద్ర, స్వానిధి, పీఎంఈజీపీ వంటి పథకాలలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


