News January 27, 2025

సంగారెడ్డి: KCRను కలిసేందుకు పాదయాత్ర 

image

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు తెలంగాణ తొలి సీఎం KCRను కలిసేందుకు సోమవారం ఝరాసంగం సంగమేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. 4 రోజుల పాటు సాగే పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని KCR ఫామ్ హౌస్ వరకు సాగనుంది. పాదయాత్రను MLA మాణిక్ రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్ ప్రారంభించారు.

Similar News

News February 6, 2025

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 6, 2025

ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

image

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News February 6, 2025

GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!

image

గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.

error: Content is protected !!