News September 25, 2024

సంగారెడ్డి: MBBS ఫస్ట్ ఇయర్‌లో 98.66% ఉత్తీర్ణత

image

సంగారెడ్డిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో 98.66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఫలితాల్లో 145 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి తెలిపారు. ఇందులో నలుగురు డిస్టింక్షన్‌లో సాధించగా, 108 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.