News February 28, 2025

సంగారెడ్డి: MLC ఎన్నికలు.. 92.57 శాతం పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలో MLCఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్స్ స్ఫూర్తిని చాటగా, పట్టభద్రులు ఫర్వాలేదనిపించారు. టీచర్స్ MLCకి 92.57 శాతం, పట్టభద్రులకు 73.19 శాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 67 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 74 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కాగా వాటిని కరీంనగర్‌లోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.

Similar News

News October 20, 2025

విశాఖ: గమనిక.. LTT ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం

image

విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లే LTT లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ సోమవారం రీ షెడ్యూలు అయింది. విశాఖలో సోమవారం(అక్టోబర్ 20) రాత్రి 11.20 గంటలకు బయలదేరాల్సిన ఈ రైలు.. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోనీ రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రేక్ ఆలస్యం కారణంగా రీషెడ్యూల్ జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News October 20, 2025

ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.

News October 20, 2025

మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

image

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్‌కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.