News February 28, 2025
సంగారెడ్డి: MLC ఎన్నికలు.. 92.57 శాతం పోలింగ్

సంగారెడ్డి జిల్లాలో MLCఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్స్ స్ఫూర్తిని చాటగా, పట్టభద్రులు ఫర్వాలేదనిపించారు. టీచర్స్ MLCకి 92.57 శాతం, పట్టభద్రులకు 73.19 శాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 67 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 74 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కాగా వాటిని కరీంనగర్లోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.
Similar News
News December 13, 2025
HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లు నిర్ణయించారు.
News December 13, 2025
జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్షాప్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.


