News March 15, 2025

సంగెం: రోడ్డు ప్రమాదం.. మేస్త్రీ మృతి

image

సంగెం మండలం తిమ్మాపురం సబ్ <<15757117>>స్టేషన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ప్రకాశం (D) జిగురుమల్లికి చెందిన బంగారు బాబు(34) కుటుంబంతో సంగెం(M)కి వలస వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పని కోసం వెళ్తున్న బాబు, మణికంఠ బైక్‌ను బొలెరో ఢీకొట్టింది. చికిత్స కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో బాబు మృతిచెందాడు. కేసు నమోదైంది.

Similar News

News November 1, 2025

కారంచేడు: మరణంలోనూ వీడని బంధం

image

కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మరణంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఆ దంపతులు. కారంచేడు(M) ఆదిపూడికి చెందిన పగడాల సుబ్బారావు(80), సుబ్బులు(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బారావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురికాగా గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భార్య మంచంలోనే ఉంది. శుక్రవారం భర్త చనిపోయాడని తెలియడంతో కొన్ని గంటల్లోనే సుబ్బులు కూడా మరణించింది. నిన్న అంత్యక్రియలు నిర్వహించారు.

News November 1, 2025

భారత్ ఓటమి.. గంభీర్‌పై విమర్శలు

image

AUS టూర్‌లో భారత పేలవ ప్రదర్శన పట్ల కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచులోనూ టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని AUS మాజీ ఓపెనర్ ఫించ్ అన్నారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News November 1, 2025

సూర్యాపేట: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

image

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.