News December 19, 2024

సంతకవిటి: ATM కార్డు మార్చి నగదు స్వాహా

image

సంతకవిటిలో ATM కార్డును మార్చి రూ. 2.17లక్షల సొమ్ము కాజేసిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు SI గోపాలరావు తెలిపారు. పోలీసుల కథనం.. గడిముడిదాం వాసి గోపాలరావు పింఛను సొమ్ము డ్రా చేసివ్వమని మోహన్‌రావుకు కార్డు ఇచ్చాడు. మోహన్‌రావు సమీపంలో మరో వ్యక్తిని డబ్బులు డ్రా చేసివ్వమన్నాడు. అతను రూ.10వేలు డ్రా చేసి కార్డు మార్చి ఇచ్చి,పలు దఫాలుగా నగదు కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు.

Similar News

News April 17, 2026

VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

image

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

News April 17, 2026

VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

image

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

News April 17, 2026

జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వర్చువల్‌గా మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 215 ప్రాధాన్యత గ్రామాల్లోని 1,679 చెరువులకు అంచనాలు సిద్ధం చేసి పంపాలని, జిల్లాలోని 8,010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను ఉపాధి హామీ పథకం కింద నమోదు చేయాలన్నారు.