News July 30, 2024
సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే PAపై ఫిర్యాదు

సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు పీఏగా వ్యవహరించిన బండారు సురేశ్, సుల్తానాపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ మేరకు వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదును ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
Similar News
News November 8, 2025
ఆ ఐదు సెలవులు రద్దు: ప్రకాశం డీఈవో

సెలవులపై ప్రకాశం డీఈవో ఎ.కిరణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెలతో పాటు వచ్చే మార్చి వరకు ఉన్న అన్ని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో వరుస సెలవులు ఇవ్వడంతో ఈ 5సెలవు రోజుల్లో స్కూళ్లు పనిచేయాలని ఆదేశించారు. ఈనెల రెండో శనివారం, డిసెంబర్ 13, 2026 జనవరి 25, ఫిబ్రవరి 14, మార్చి 14వ తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలన్నారు.
News November 8, 2025
జిల్లా స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థుల ఎంపిక

ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్-14 లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న వి.మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. ఎం. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.
News November 8, 2025
ముండ్లమూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ముండ్లమూరు మండలం వేంపాడు-పోలవరం మధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అద్దంకి నుంచి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్ను క్రాస్ చేసే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సుభానిని 108లో అద్దంకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


