News March 20, 2025

సంతమాగులూరు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందిన ఘటన సంతమాగులూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టావారి పాలెం గ్రామానికి చెందిన షాహినా బేగం(68) అనే వృద్ధురాలు హైదరాబాదు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో ప్రయాణికులు 108కి సమాచారం ఇవ్వగా, అప్పటికే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్‌లో ఆడి పాడి సేద తీరారు.

News December 1, 2025

సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్‌లో ఆడి పాడి సేద తీరారు.

News December 1, 2025

WNP: ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి: TPUS

image

గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో గర్భిణీ ఉపాధ్యాయులను, చంటి పిల్లల తల్లులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, PHC ఉపాధ్యాయులను, రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ఆధ్వర్యంలో డీపీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ఉన్నారు.