News January 11, 2025
సంతమాగులూరు: సంక్రాంతికి ఊరు వస్తూ వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736599606564_1271-normal-WIFI.webp)
సంతమాగులూరు మండలంలోని పుట్ట వారి పాలెం వద్ద శనివారం కారు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందినట్లుగా సంతమాగులూరు పోలీసులు చెప్పారు. కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో అతన్ని నరసరావుపేటలో ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా చెప్పారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామైన రావినూతల వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
Similar News
News January 21, 2025
అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737378110893_51971987-normal-WIFI.webp)
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 20, 2025
ప్రకాశం: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737377184707_50408257-normal-WIFI.webp)
ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
News January 20, 2025
త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737341425372_51254428-normal-WIFI.webp)
త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.