News January 7, 2025

సంతమాగులూరు: Way2News కథనానికి స్పందించిన మంత్రి లోకేశ్

image

సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఈనెల రెండో తేదీన రోడ్డు ప్రమాదం జరిగి బాలుడికి గాయాలయ్యాయి. ఈ కథనం <<15047387>>Way2News<<>>లో ప్రచురితమైంది. ఈ వార్తకు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విటర్(X) వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన బృందం దానిని పరిశీలించి, సాధ్యమైన సహాయం బాలుడికి చేస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2025

త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు

image

త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి  గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2025

ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా

image

ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

News January 20, 2025

సిమ్లాలో పర్యటించిన పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎంపీ మాగుంట

image

గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో‌ ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో‌ నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.