News June 25, 2024

సంత్రాగచ్చి-విశాఖ రైలు రీ షెడ్యూల్

image

సంత్రాగచ్చి-విశాఖ రైలును రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సంత్రాగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 8.20 గంటలకు బయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రైలు ఆలస్యంగా వస్తుండడంతో దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 2, 2026

న్యూఇయర్ రోజు విశాఖలో యువకుడి ఆత్మహత్య

image

న్యూఇయర్ వేళ విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్‌కి చెందిన షణ్ముఖరావు (33) తన పిన్ని వద్ద ఉంటూ గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు జానీ, గోపాల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరగడంతో జానీని కొట్టాగా.. అతడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన షణ్ముఖరావు మామిడి తోటలో గురువారం ఉరివేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.

News January 2, 2026

సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

image

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.

News January 2, 2026

సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

image

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.