News December 14, 2024
సంధ్య థియేటర్ తరఫున వాదించిన న్యాయవాది మన మెట్ పల్లి వాసినే..
పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.
Similar News
News January 23, 2025
శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్న మంత్రి పొన్నం
రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
News January 23, 2025
కరీంనగర్: స్పౌజ్ కేటగిరికి దరఖాస్తులు
స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.
News January 22, 2025
సిరిసిల్ల: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. రుద్రంగి గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.