News September 21, 2024

సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 18, 2025

కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంతకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.

News December 18, 2025

కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.

News December 18, 2025

కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

image

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.