News August 10, 2024
సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి

సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం ఊబ పొలం గ్రామానికి చెందిన వంతల పరిమళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. నర్సీపట్నం వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పారు. బిడ్డను బయటకు తీయగా తల్లి కూడా మృతి చెందింది.
Similar News
News November 18, 2025
సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 18, 2025
సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 18, 2025
కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.


