News April 20, 2025
సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 20, 2025
విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్లు: కేశినేని చిన్ని

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
News April 20, 2025
రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.
News April 20, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

∆శ్రీశైలంలో కర్ణాటక బస్సుకు తప్పిన పెను ప్రమాదం
∆ఆత్మకూరులో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
∆నిరుపేదలకు వైద్యం అందించాలనేది లక్ష్యం: MP
∆డోన్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
∆నరసింహ స్వామి ఆలయంలో మంత్రి బీసీ ప్రత్యేక పూజలు
∆హోటల్ యజమానులకు ఆళ్లగడ్డ సీఐ హెచ్చరికలు
∆ఆత్మకూరులో రోడ్లపైనే నిలిచిన నీరు