News February 13, 2025

సఖినేటిపల్లి: విరుచుకుపడిన అంబోతు.. వ్యక్తి మృతి

image

సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వేప చెట్టు వద్ద బుధవారం రాత్రి దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న మోరిపోడుకు చెందిన గుబ్బల మురళీకృష్ణ (30)పై ఆంబోతు దాడి చేసింది. ఈ దాడిలో మురళీకృష్ణ గొంతుకి ఆంబోతు కొమ్ము గుచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సఖినేటిపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. మురళీకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News February 26, 2026

కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే పార్థసారథికి గాయం

image

అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గాయపడ్డారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆయన కిందపడటంతో పాదం భాగంలో గాయమైంది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయనకు గాయం కావడంతో తోటి ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

News February 26, 2026

NRPT: డయల్ యువర్ డీఎం.. కాల్ చేయండి

image

డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News February 26, 2026

BELలో 72 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), నవీ ముంబైలో 72 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. BE/BTech(ECE,ME), BSc, BCom, BA, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా, ఐటీఐ అప్రెంటిస్‌లకు 21ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.