News March 24, 2025
సచివాలయానికి వెళ్లాలంటే ఫోన్లు డిపాజిట్ చేయాల్సిందే !

సచివాలయం ప్రజా ప్రభుత్వానికి చిహ్నమని, ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చని అప్పట్లో CM రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాగా ఇటీవల సచివాలయంలో ఏర్పడిన పరిమితులపై ప్రజల నుంచి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రజలు, ప్రతినిధులు, మీడియా స్వేచ్ఛగా సచివాలయంలోకి రావచ్చని చెప్పిన ప్రభుత్వ విధానం ఇప్పుడు విరుద్ధమైందని విమర్శలు వస్తున్నాయి. సచివాలయంలోకి వెళ్లే వారు తమ ఫోన్లను డిపాజిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Similar News
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
News November 27, 2025
ఐబొమ్మ రవి: కస్టడీల పరంపర కొనసాగుతుందా?

ఐబొమ్మ రవిని పోలీసులు మరో కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్లు తెలిసింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదుచేశారు. ఈ కేసులన్నింటినీ విచారణ జరపాలంటే కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల భావన. దీంతో మొత్తం కేసుల్లోనూ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.


