News April 2, 2024

సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారుపై కేసు నమోదు

image

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సంఘం సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెలగపూడి సచివాలయంలో గత నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి మాట్లాడినట్లు, టీడీపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా తుళ్ళూరు సీఐ సుభాని సెక్షన్ 188, 171F కింద కేసు నమోదు చేశారు.

Similar News

News October 22, 2025

GNT: వారు తడబడినా.. మనమే ఆత్మవిశ్వాసం నింపాలి.!

image

ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. గుంటూరు జిల్లాలో పెద్దలలో తడబడటం సుమారు 1% వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. పిల్లల్లో మొదట్లో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. స్పీచ్ థెరపిస్టులు తడబడే సహాయం చేస్తున్నప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం.

News October 21, 2025

ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

image

ఆర్టీజీఎస్‌లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

News October 21, 2025

మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

image

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్‌ను ప్రారంభించారు.