News February 26, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.
Similar News
News October 25, 2025
ఎల్లారెడ్డిపేట: వికటించిన ఆర్.ఎం.పి వైద్యం

ఎల్లారెడ్డిపేట(M) రాచర్ల గుండారంలో ఓ RMP వైద్యం వికటించి ఏడేళ్ల బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పండుగ శివాన్షును తల్లిదండ్రులు స్థానిక RMP వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు ఇంజెక్షన్తో పాటు హైడోస్ సెలైన్ ఇవ్వడం వల్ల బాలుడికి ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. వెంటనే సిరిసిల్లలోని ప్రవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
News October 25, 2025
నిర్మల్: ‘నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించండి’

మార్చి 2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును డీఈవో భోజన్న శనివారం తెలిపారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 29 వరకు రూ.50, డిసెంబర్ 11 వరకు రూ.200, డిసెంబర్ 29 వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని సూచించారు.
News October 25, 2025
హైదరాబాద్లో స్టార్లింక్ ఎర్త్ స్టేషన్?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన ‘స్టార్లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్లింక్కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.


