News March 13, 2025

సత్తమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

image

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి సత్తమ్మ(87) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పూర్వం చేర్యాల నియోజకవర్గం సీపీఐ నాయకులు మద్దూరు మండలం నర్సాయపల్లిలో స్వగృహంలో సత్తమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 23, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

image

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

News October 23, 2025

జిల్లాలో మూడు చోట్ల వ్యాసరచన, వక్తృత్వ పోటీలు: DEO

image

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు చోట్ల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. 8 నుంచి టెన్త్ విద్యార్థులు దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టాలు అనే అంశాలపై వ్యాసరచన అద్భుత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాయచోటి డైట్ కళాశాల, మదనపల్లి జడ్పీ హై స్కూల్, రాజంపేట గర్ల్స్ హైస్కూల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.

News October 23, 2025

GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

image

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.