News February 4, 2025

సత్తా చాటిన చుండూరు ఎడ్లు

image

పల్నాడు జిల్లా రెంటచింతలలో జరుగుతున్న బండలాగుడు పోటీలలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు సత్తా చాటాయి. జూనియర్ విభాగంలో వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శివకృష్ణకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోహన్ బాబుకు చెందిన ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

Similar News

News December 18, 2025

HYDలో Live-in ఫోబియా.. ట్రెండింగ్‌లో సిట్యుయేషన్ షిప్!

image

‘సిట్యుయేషన్ షిప్’.. ప్రేమ వద్దు, పెళ్లి అంతకన్నా వద్దు. కేవలం తోడు కోసం సాగే తాత్కాలిక బంధం ఇది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో యువతలో ‘కమిట్‌మెంట్’ పట్ల భయం పెరిగిపోతుండటంతో ఈ ధోరణి బలపడుతోంది. ​భావోద్వేగాలను పంచుకుంటారు కానీ.. భవిష్యత్తులో ఉండరు. ఈ బంధాలు చివరకు తీవ్రమైన అభద్రతాభావాన్ని, మానసిక ఒత్తిడిని మిగిలిస్తున్నాయి. ఇలా సంప్రదాయ కుటుంబ వ్యవస్థ బీటలు వారుతోంది. దీనిపై మీ కామెంట్?

News December 18, 2025

భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

image

జిల్లాలోని కాటారం మండలం గుమ్మలపల్లి సర్పంచ్‌గా 23 ఏళ్ల భక్తు శరత్ కుమార్ ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహదేవపూర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శరత్, పిన్న వయస్కుడైన సర్పంచిగా గుర్తింపు పొందారు. రాజకీయాల ద్వారా గ్రామాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని శరత్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆయన ఆకాంక్షించారు.

News December 18, 2025

వేమూరు: ‘చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వ ప్రోత్సహిస్తోంది’

image

చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ
జనరల్ మేనేజర్ రామకృష్ణ అన్నారు. శుక్రవారం వేమూరు ఎంపీడీవో కార్యాలయంలో పారిశ్రామికవేత్తల ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాల సభ్యులు యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుకు పీఎంఈజీ, పీఎంఎఫ్ఈ రుణాలు పొందాలంటే ఉద్యమ ఆధార్ నమోదు కావాలన్నారు.