News February 4, 2025
సత్తా చాటిన చుండూరు ఎడ్లు

పల్నాడు జిల్లా రెంటచింతలలో జరుగుతున్న బండలాగుడు పోటీలలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు సత్తా చాటాయి. జూనియర్ విభాగంలో వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శివకృష్ణకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోహన్ బాబుకు చెందిన ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
Similar News
News December 13, 2025
KMR: సర్పంచ్ పోరులో యువత.. రేపటి భవిష్యత్తుకై

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో యువత, మహిళలు విజయదుందుభి మ్రోగించగారు. రేపటి రెండవ విడత ఎన్నికల్లో పోరులో నిలిచిన యువత రాజకీయంగా తమ స్థానాలను కొంగ్రొత్త ఆశలతో రాణిస్తారో లేదో చూడాలి. దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులను పరంపరను పుణికిపుచ్చుకుంటున్న యువత రేపటి భవిష్యత్తుకై తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.
News December 13, 2025
NZB: రెండవ విడత GP ఎన్నికల పోలింగ్ వివరాలు

పోలింగ్ సమయం: ఉదయం7గంటల నుంచి 1 గంట వరకు
*మొత్తం సర్పంచ్ స్థానాలు: 196
*ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు: 38
*ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు:158
*పోటీలో ఉన్న అభ్యర్ధులు: 568
*మొత్తం వార్డు స్థానాలు: 1760
*ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు: 674
*ఎన్నికలు జరుగనున్న వార్డులు:1081
*పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634
*ఓటర్ల సంఖ్య: 2,38,838
*పోలింగ్ కేంద్రాలు : 1476
News December 13, 2025
WGL: 80 సీట్లకు 5,648 మంది పోటీ

నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో శనివారం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే పరీక్షకు 28కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించారు. 5,648 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, మొత్తం 80 సీట్లు ఉన్నాయి. మామునూరు JNVలో సీటు లభిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య లభిస్తుందని ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు.


