News February 4, 2025
సత్తా చాటిన చుండూరు ఎడ్లు

పల్నాడు జిల్లా రెంటచింతలలో జరుగుతున్న బండలాగుడు పోటీలలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు సత్తా చాటాయి. జూనియర్ విభాగంలో వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శివకృష్ణకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోహన్ బాబుకు చెందిన ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
Similar News
News March 11, 2026
పొట్టను దాస్తూ అలసిపోయా.. తగ్గి చూపిస్తా: KTR

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్లో కసరత్తు చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. తన పొట్టను దాస్తూ అలసిపోయానని, 6 నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్లో కసరత్తు మొదలుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. జులైలో తనకు 50 ఏళ్లు రానున్నాయని, ఆ నాటికి స్లిమ్గా మారతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా విజయ్ దేవరకొండ రిసెప్షన్లో కేటీఆర్ తన పొట్టను దాస్తూ సరదాగా కామెంట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
News March 11, 2026
20 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్: CBN

AP: 20 నెలల్లో సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘సూపర్ సిక్స్తో పాటు ఇతర పథకాలూ అమలు చేశాం. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ముందుకెళ్తున్నాం. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ, 2.50 లక్షల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఫర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే ముందుకు వెళ్లలేం’ అని తెలిపారు.
News March 11, 2026
పెదకాకాని మర్డర్ కేసు ఛేదించిన GRP పోలీసులు

పెదకాకాని రైల్వే స్టేషన్లో మార్చి 4న జరిగిన హత్య కేసును గుంటూరు GRP పోలీసులు, RPF సిబ్బంది ఛేదించారు. మృతుడు పరమడం అనీశ్ బ్లేడ్గా గుర్తించారు. దొంగతనాల వాటా విషయంలో జరిగిన వివాదంతో అతని సహచరులే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఎఫ్. కుమార్ ఎంతోని కుమార్, దీపేశ్ MS మెంటల్, కొప్పుల వెంకటేశ్ వెంగీలను మార్చి 9న గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.


