News March 2, 2025
సత్తుపల్లిలో గురు శిష్యుల కలయిక… ఎవరెవరో తెలుసా..?

వారిద్దరు గురు శిష్యులు. మళ్లీ ఇద్దరి పేరూ ఒక్కటే. ఒకరినొకరు ఏడాదిగా కలుసుకున్నది లేదు. కానీ వాళ్లు పలకరించుకునేందుకు సందర్భంగా మారిన ఘటన శనివారం సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. అయితే వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే.. మరొకరు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. సీనియర్ నేత గాదె సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరైన సందర్భంలో చిత్రమిది.
Similar News
News May 7, 2025
KMM: సెలవుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

బడులకు వేసవి సెలవులు, పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి. పిల్లలకు ఆటలు, తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు.. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో పిల్లలు ఆటవిడుపు కోసం బయటకి వెళ్లి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News May 7, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

1) ఖమ్మం: ‘విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు’ 2) ఏన్కూర్: ‘ఎన్నికలొస్తే బీఆర్ఎస్దే విజయం’ 3) కూసుమంచి: ఖమ్మం-సూర్యాపేట హైవేపై ఆటో పల్టీ 4) మధిర: వర్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 30న సభ 5) మధిర: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ 6) ఖమ్మం: తపాలా శాఖ రూ.10, రూ.15లక్షల బీమా 7) ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: వైరా ఎమ్మెల్యే 8) ఖమ్మం: ఆరోగ్య రక్షణలో వైద్యులు కీలకం: కలెక్టర్.
News May 7, 2025
ఖమ్మంలో మళ్లీ తగ్గుతున్న టమాటా ధరలు

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’Sకాలనీ)లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.18, వంకాయ 20, బెండకాయ 20, పచ్చిమిర్చి 40, కాకర 46, కంచకాకర 50, బీరకాయ 50, సొరకాయ 16, దొండకాయ 18, క్యాబేజీ 20, చిక్కుడు 66, ఆలుగడ్డ 26, చామగడ్డ 40, క్యారెట్ 30, బీట్రూట్ 24, బీన్స్ 66, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 25, కోడిగుడ్లు(12) రూ.65గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.