News June 4, 2024
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News January 7, 2026
రాజధాని అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.!

మంగళగిరి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పశ్చిమ బైపాస్ సంక్రాంతికి పాక్షికంగా అందుబాటులోకి తేవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నిర్ణయించారు. అమరావతి రాజధానిలో కీలకంగా నిలవనున్న ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే NH 16, విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. చినకాకాని నుంచి గొల్లపూడి వరకు 17.636 కిలోమీటర్ల మేర రూ.1,546 కోట్ల వ్యయంతో బైపాస్ నిర్మాణాన్ని చేపట్టారు.
News January 7, 2026
GNT: ధరల పతనానికి బ్రేక్.. మిర్చి మార్కెట్లో ప్రభుత్వం ఫుల్ కంట్రోల్

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 7, 2026
GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


