News April 8, 2025
సత్తెనపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ సురేశ్ కుమార్ కుమార్తె సాహితీ సంధ్య (18) శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది. సెలవులకి ఇంటికి వచ్చింది. కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సంధ్య చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
తిరుపతిలో కాలేజీ లెక్చరర్ సస్పెండ్

తిరుపతిలోని SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత పాఠాలు చెప్పిన కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థులకు <<18550600>>అన్యమత పాఠాలు <<>>చెప్పడంపై Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన ప్రిన్సిపల్ వెంటనే ఆమెను విచారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమె గతంలోనూ ఇలాంటివి చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు.
News December 13, 2025
Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.
News December 13, 2025
కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ

హైదరాబాద్ వచ్చిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్లో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి బయల్దేరుతారు.


