News March 13, 2025

సత్తెనపల్లి: అల్లుడి చేతిలో.. మామ హతం

image

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో అల్లుడు చేతిలో మామ హతమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. దీపాలదిన్నెపాలెంకు చెందిన గంగయ్య(గంగారమ్) తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అల్లుడ్ని మందలించేందుకు వచ్చిన మామ, బావమరిదిపై గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బత్తుల గంగయ్య(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలి: ADB SP

image

బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి సూచించారు. గురువారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలన్నారు. పట్టణంలో బీట్ సిస్టం సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. పోలీసులు READY

image

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కమిషనరేట్‌కు చెందిన అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రామాల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 27, 2025

జగిత్యాల జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు ఎన్నంటే..?

image

జగిత్యాల జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు, 3536 వార్డులు ఉండగా, ఇందుకోసం 3536 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ముఖ్యంగా 75 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించి, అందుకు తగిన భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో 1వ విడతలో 122 పంచాయతీలకు 1172 పోలింగ్ కేంద్రాలు, 2వ విడతలో 144 పంచాయతీలకు1276 పోలింగ్ కేంద్రాలు, 3వ విడతలో 119 పంచాయతీలకు 1088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.