News March 13, 2025
సత్తెనపల్లి: అల్లుడి చేతిలో.. మామ హతం

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో అల్లుడు చేతిలో మామ హతమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. దీపాలదిన్నెపాలెంకు చెందిన గంగయ్య(గంగారమ్) తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అల్లుడ్ని మందలించేందుకు వచ్చిన మామ, బావమరిదిపై గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బత్తుల గంగయ్య(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
సంగారెడ్డి: పాఠశాలలపై చర్యలు: డీఈవో

జిల్లాలో ఈనెల 15 నుంచి ప్రారంభమైన హాఫ్డే స్కూల్స్ నడుపని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల ఒంటి పూట బడులు నడపడం లేదని, పూర్తి రోజు పాఠశాలలను నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 19, 2025
సంగారెడ్డి: రేపు పోలీస్ స్టేషన్లకు పది ప్రశ్నాపత్రాలు

పదో తరగతి సెట్-2 ప్రశ్నాపత్రాలు బుధవారం పోలీస్ స్టేషన్లకు చేరుకుంటాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ లాక్డ్ ట్రంక్ బాక్స్లతో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 19, 2025
అద్భుతం.. సుద్ద ముక్కతో మక్కా మజీద్

ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుకృష్ణ శుద్ధ ముక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. మక్కా మజీద్ నమూనాను తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ నమూనాను తయారు చేసినట్లు మధుకృష్ణ వెల్లడించారు. చిత్రకారుడిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.