News May 26, 2024

సత్తెనపల్లి మీదుగా వెళ్లే రైళ్లు దారి మళ్లింపు

image

పల్నాడు జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో సత్తెనపల్లి మీదగా వెళ్లే ఫలక్నామా ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్‌లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు కాజీపేట, విజయవాడ మీదుగా గమ్య స్థలానికి వెళ్తాయన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు వేగవంతం చేశామని చెప్పారు.

Similar News

News January 7, 2026

GNT: హెల్మెట్ లేకపోతే వాట్సాప్ హెచ్చరికలు

image

ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిని గుర్తించి, వారి ఫోన్‌లకు వాట్సాప్ హెచ్చరికలు పంపిస్తోంది. రహదారి భద్రత సూచనగా పంపిన ఈ సందేశాల్లో నో హెల్మెట్ ఉల్లంఘనను చివరి హెచ్చరికగా పేర్కొంటూ, మళ్లీ కొనసాగితే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

News January 7, 2026

మూడు సార్లు ఎమ్మెల్యేగా తెనాలి మహిళ

image

దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బీఎస్సీ (హోం సైన్స్)లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు (1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.

News January 7, 2026

గుంటూరు: ఫిబ్రవరిలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

గుంటూరులో అగ్నివీర్ సైనిక నియామక ప్రక్రియను వచ్చే ఫిబ్రవరి 17-27 మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని పదిరోజులకు పైగా ర్యాలీ కొనసాగనుంది. ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ జరగనుండగా, దశలవారీగా శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ముందస్తుగా ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలి.