News October 21, 2024
సత్యనారాయణ రెడ్డి ఇంటిపై దాడి.. మాజీ మంత్రి కాకాణి ఏమన్నారంటే

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లకూరు మండలంలో జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటికి తాళాలు వేసి దాడులు చేయడం దారుణమని అన్నారు. సోమవారం సత్యనారాయణ ఇంటి వద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 18, 2025
నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.
News November 18, 2025
నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.


