News April 5, 2025
సత్యసాయి: జగ్జీవన్ చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్నతోపాటు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
రేపు ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి రేపు కొత్త అప్డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
News April 8, 2025
సీఎం ఛైర్మన్గా జలహారతి కార్పొరేషన్

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.
News April 8, 2025
థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

కేకేఆర్తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.