News March 2, 2025
సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై వినతులు తీసుకుంటామని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News October 14, 2025
ఎచ్చెర్ల: క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News October 14, 2025
ఏపీ రౌండప్

* ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల బదిలీ.. గుజరాత్ HC నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ నుంచి జస్టిస్ డూండి రమేశ్, కోల్కతా నుంచి జస్టిస్ సుబేందు సమంత బదిలీ
* వైజాగ్లోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు మినీ రత్న హోదా
* కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యకు YCP నేతల ఫిర్యాదు
* విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు
News October 14, 2025
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్తో కలెక్టర్ సమావేశం

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి పారిశ్రామిక భద్రతా కమిటీ క్రైసిస్ గ్రూపుల కమిటీ సమావేశాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, సేఫ్టీ అధికారులతో కలసి కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేటగిరీల వారీగా 36 పరిశ్రమలు మీద భద్రత ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఫ్యాక్టరీలో ఎస్ఓను ఏర్పాటు చేయాలన్నారు.