News March 2, 2025

సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై వినతులు తీసుకుంటామని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News December 3, 2025

భద్రాద్రి: 33 సర్పంచ్, 48 వార్డు మెంబర్లు నామినేషన్

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజైన మంగళవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల వివరాలు
అన్నపురెడ్డిపల్లి 2, 2
అశ్వరావుపేట 4, 9
చండ్రుగొండ 2, 4
చుంచుపల్లి 3, 3
దమ్మపేట 6, 10
ములకలపల్లి 4, 4
పాల్వంచ 12, 16
మొత్తం 33 సర్పంచ్, 48 వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు.

News December 3, 2025

భద్రాచలం MLA అభ్యర్థి.. సర్పంచ్ పదవికి నామినేషన్

image

భద్రాచలం సర్పంచ్ బరిలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న మానే రామకృష్ణ నిలవడంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది. వీఆర్‌వో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన రామకృష్ణ, 2014లో భద్రాచలం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 10 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2 సార్లు అసెంబ్లీ టికెట్ దక్కకపోయినా, పార్టీ అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రంగప్రవేశం చేశారు.

News December 3, 2025

RGM: మఫ్టీలో షీ టీమ్స్.. ఆకతాయిల ఆటకట్టు

image

RGM కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రత కోసం షీ టీంలు మఫ్టీలో నిఘా పెంచాయని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్కూల్‌లు, కాలేజీలు, బస్టాండ్‌ల వద్ద మహిళలు ఇబ్బందులు పడకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. NOVలో 68 పిటిషన్లు స్వీకరించి, 4 FIRలు, 9 పెట్టీ కేసులు, 28 కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. డీకాయ్ ఆపరేషన్లలో 60మందిని పట్టుకున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా షీ టీం నంబర్లను సంప్రదించాలన్నారు.