News March 2, 2025

సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై వినతులు తీసుకుంటామని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News November 24, 2025

వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత బాధ్యతలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెను.. సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగం పనిచేస్తూ బదిలీపై WGL సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించబడ్డారు.

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.

News November 24, 2025

సిద్దిపేట: అకాల వర్షాలు.. అలర్ట్‌గా ఉండండి: కలెక్టర్

image

జిల్లాలో రాబోయే నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులందరూ అలెర్ట్‌గా ఉండాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి అన్ని శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాల నుంచి ధాన్యం తడవకుండా రైతులకు వెంటనే టార్పాలిన్ కవర్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.