News January 28, 2025
సత్యసాయి జిల్లాలో ఫిర్యాదులకు 67 పిటిషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. సోమవారం జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన ఎస్పీ రత్న సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
Similar News
News January 7, 2026
మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మార్కాపురంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఎస్ఐ సైదుబాబుకు సమాచారం అందింది. ఆయన అక్కడికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 7, 2026
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా!

సెన్సార్ జాప్యంతో విజయ్ నటించిన ‘జన నాయగన్’ <<18789554>>వాయిదా<<>> పడినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ RFT Films ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలో బుక్ మై షో నుంచి ఈ మూవీని తొలగించడంతో తమిళనాడులోనూ పోస్ట్పోన్ అయినట్లేనని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు సినిమా వాయిదా పడిందని తమిళ మీడియా పేర్కొంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు తీర్పు చెప్తామని కోర్టు తెలిపింది.
News January 7, 2026
WNP: నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం: కలెక్టర్

సకాలంలో సీఎంఆర్ ధాన్యం సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు వేగంగా నగదు పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రైతులకు నగదు పెండింగ్ ఉందని వారికి వేగంగా నగదు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


